వార్తలకు తిరిగి వెళ్లండి
డీఎస్సీపై మంత్రి విమర్శలు

డీఎస్సీపై వైకాపా నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తూ అనవసర గందరగోళం సృష్టిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించిందని తెలిపారు.
మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. చంద్రబాబు హయాంలో మొత్తం 1.80 లక్షలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించారని మంత్రి పేర్కొన్నారు.
Comments
Loading comments...