వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మైలారపు లింబాద్రి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో పట్టణ అభివృద్ధి, మౌలిక వసతులకు సంబంధించిన 13 అంశాలకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు, గుంతల పూడ్చివేత, వినాయక మండపాల వద్ద నీరు నిలవకుండా చర్యలు, పారిశుధ్యం, వీధి దీపాల ఏర్పాటుపై చర్చించారు. అన్ని వార్డులను సమాన ప్రాధాన్యతతో అభివృద్ధి చేస్తామని చైర్మన్ తెలిపారు.
Comments
Loading comments...

