వార్తలకు తిరిగి వెళ్లండి
గంజాయి కారు బోల్తా: 80 కేజీలు లభ్యం

ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు వెంబడించడంతో గంజాయి తరలిస్తున్న కారు మాకవరం సమీపంలో బోల్తా పడింది. కారును పరిశీలించిన పోలీసులు అందులో తరలిస్తున్న 80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
స్థానికుల సహకారంతో వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...