Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితాలో భారీ లోపాలు

స్వప్న రెడ్డి Jul 28, 2026 7:44 AM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
ఓటర్ల జాబితాలో భారీ లోపాలు - Udayam Digital
జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో మృతులు, డబుల్‌ ఎంట్రీలు, శాశ్వత వలసలు వెళ్లిన వారి పేర్లు ఉన్నట్లు ప్రత్యేక సమగ్ర సవరణలో అధికారులు గుర్తించారు. ఇచ్ఛాపురం, శ్రీకాకుళంలో ఇలాంటి ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇచ్ఛాపురం, శ్రీకాకుళం, ఎచ్చెర్లలో మృతుల పేర్లపై పదివేలకుపైగా ఓట్లు ఉన్నట్లు తేలింది. గతంలో నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల జాబితా నిర్వహణ జరిగిందనే ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి.

Comments

G
Loading comments...