వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్ బాలికను వివాహం చేసుకుంటానని నమ్మించి తీసుకెళ్లిన ఘటనపై సంతకవిటి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఈనెల 1న ఇంట్లో ఎవరూ లేనప్పుడు బొబ్బిలికి తీసుకెళ్లినట్లు తల్లి ఫిర్యాదు చేసింది.
గతంలోనూ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ గోపాలరావు ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

