వార్తలకు తిరిగి వెళ్లండి
కాళేశ్వరంపై పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ వ్యాఖ్యలు

కేసీఆర్ నియంతృత్వ వైఖరి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం చెందిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాళేశ్వరం అంశంపై భారాస నాయకులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నాణ్యతా లోపాలు ఉన్నందునే ఎన్డీఎస్ఏ ఆదేశాల మేరకు నీటి తరలింపు నిలిపివేశామని తెలిపారు. త్వరలోనే సాంకేతిక పరీక్షలు పూర్తి చేసి పునరుద్ధరణ పనులు చేపడతామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...