వార్తలకు తిరిగి వెళ్లండి

మారుమూల ప్రాంతాల పేద విద్యార్థులకు విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో పీపుల్స్ చిల్డ్రన్ సంస్థ ఏర్పాటు చేసిన పాఠశాలను మంత్రి సీతక్క కోయగూడెంలో ప్రారంభించారు. పాఠశాలలో విద్యార్థులకు కల్పించే సౌకర్యాలను పరిశీలించారు. పేద పిల్లల విద్య కోసం సంస్థ చేస్తున్న సేవలను అభినందించారు.
ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. పాఠశాల అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

