Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో 33 కోట్లు దాటిన ఎల్‌పీజీ వినియోగదారులు

Follow Udayam Digital on Google
పవని రెడ్డి Jul 30, 2026 6:42 PM అల్ ఇండియా జాతీయ
దేశంలో 33 కోట్లు దాటిన ఎల్‌పీజీ వినియోగదారులు  - Udayam Digital
దేశంలో ఎల్‌పీజీ వినియోగదారుల సంఖ్య 33.13 కోట్లకు చేరిందని, ఇందులో 10.58 కోట్ల ఉజ్జ్వల యోజన కనెక్షన్లు ఉన్నట్లు లోక్‌సభలో పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి తెలిపారు. మార్కెట్ ధరకంటే తక్కువకే నియంత్రిత ధరలకే వినియోగదారులకు సిలిండర్లు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రూ.942 ధర ఉన్న సిలిండర్‌పై రూ.500లకు పైగా సబ్సిడీ ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...