Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండల ప్రజావాణికి స్పందన కరువు

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 6:32 PM పెద్దపల్లి తెలంగాణ
మండల ప్రజావాణికి స్పందన కరువు - Udayam
మంథని డివిజన్‌లోని నాలుగు మండలాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. అధికారులు ముందుగా ప్రచారం చేయకపోవడంతో ప్రజలకు కార్యక్రమంపై అవగాహన లేక స్పందన తక్కువగా కనిపించింది. మంథనిలో 21, రామగిరిలో 6, కమాన్‌పూర్‌లో 7, ముత్తారంలో 3 చొప్పున మొత్తం 37 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినవే ఉన్నాయి. గ్రామస్థాయిలో ప్రచారం చేయాలని సర్పంచులు కోరారు.

Comments

G
Loading comments...