వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యుదాఘాతంతో రెండు చేతులు కోల్పోయి

విద్యుదాఘాతానికి గురై రెండు చేతులు కోల్పోయిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన పంచాయతీ సిబ్బంది బాలకిషన్కు ప్రభుత్వం నుంచి కనీస సాయం అందడం లేదు. వీధి దీపం మరమ్మతు చేస్తుండగా ప్రమాదం జరిగి రూ.15 లక్షలు ఖర్చయ్యాయి.
ఏడాది దాటుతున్నా ఆసరా పింఛను గానీ, అధికారుల పరామర్శ గానీ లభించలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనను, తన కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
Comments
Loading comments...