వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసుల చర్యలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి.
ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయం చేపట్టేందుకు ప్రయత్నించారు. కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో గందరగోళం కొనసాగి సభ వాయిదా పడింది.
Comments
Loading comments...
