Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

Follow Udayam on Google
B RAJESH Aug 20, 2026 8:26 AM విజయనగరంGeneral
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ - Udayam
జిల్లా జలవనరుల శాఖ ఏఈ, గరివిడి ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్న కింతల మహేశ్ ఏసీబీకి చిక్కారు. కొండలక్ష్మీపురం గ్రామంలో కోళ్ల ఫారం ఏర్పాటుకు సంబంధించి పంచాయతీ తీర్మానం, అనుమతుల కోసం మీసాల ప్రశాంత్ నుంచి రూ.15,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ వేశారు. విజయనగరంలోని ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద లంచం తీసుకుంటుండగా మహేశ్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Comments

G
Loading comments...