Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లలితా మాతా దేవాలయంలో అమావాస్య శుక్రవారం పూజలు

Follow Udayam on Google
Devender Bale Sep 11, 2026 7:35 PM జగిత్యాలGeneral
పొలాసలోని 108 శ్రీచక్ర సహిత శ్రీలలితా మాతా దేవాలయంలో అమావాస్య శుక్రవారం సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించామని చైర్మన్ చెల్లం స్వరూప తెలిపారు. లలితా సహస్రనామ పారాయణం, మణిద్వీప వర్ణన పారాయణం, కుంకుమార్చన, నక్షత్ర హారతి చేపట్టారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణ కావించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మ వారి కృపకు పాత్రులయ్యారని విన్నవించారు.

Comments

G
Loading comments...