వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లోని 37వ డివిజన్ లక్ష్మీనగర్లో డ్రైనేజీ, వర్షపు నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు.
కార్పొరేటర్ కేఏపీపీ చంద్ర విజ్ఞప్తి మేరకు ఆయన లక్ష్మీనగర్లో పర్యటించి, స్థానికులతో మాట్లాడారు. మురికినీటి ఇబ్బందికి శాశ్వత పరిష్కారం చూపేలా పనులు చేపట్టాలని కార్పొరేటర్కు సూచించారు. త్వరలోనే పనులు ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

