వార్తలకు తిరిగి వెళ్లండి

గోవిందరావుపేట మండలంలో లక్నవరం చెరువు నుంచి సాగునీరు వెంటనే విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 7లోపు నీరు విడుదల చేయకుంటే 10 తర్వాత జాతీయ రహదారి దిగ్బంధం చేపడతామని హెచ్చరించారు.
ప్రస్తుతం చెరువులో 22.4 అడుగుల నీరు ఉన్నా పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి సమస్యపై పోరాటానికి 53 మందితో రైతు కమిటీని ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

