వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్లో సంజు చౌదరి(26) దుకాణం పేరుబోర్డును బైండింగ్ వైరుతో కట్టేందుకు పైకి ఎక్కాడు. ఈ క్రమంలో హైటెన్షన్ విద్యుత్ తీగల నుంచి షాక్ తగిలి కుప్పకూలాడు.
కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.
Comments
Loading comments...

