Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విప్రో జాప్యంపై కేంద్రానికి లేఖ

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 14, 2026 10:12 AM హైదరాబాద్తెలంగాణ
విప్రో జాప్యంపై కేంద్రానికి లేఖ - Udayam
విప్రోలో ఎంపికైన 200 మందికి పైగా అభ్యర్థుల ఆన్‌బోర్డింగ్‌లో తీవ్ర జాప్యంపై ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్‌ కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయకు లేఖ రాసింది. బాధితుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కోరింది. 2025లో ఆఫర్‌ లెటర్లు అందుకుని, మార్చి 2026లో బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌ పూర్తిచేసుకున్నా చేరిక తేదీ ఇవ్వలేదని పేర్కొంది. ఆన్‌బోర్డింగ్‌పై విప్రో స్పష్టమైన ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్‌ చేసింది.

Comments

G
Loading comments...