వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం వెంకంపల్లి శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. పొలానికి వెళ్తున్న రైతు సత్యనారాయణకు చిరుత కనిపించడంతో గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు.
అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్ఓ వాసుదేవరావు సూచించారు. చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

