Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌పై లష్కర్‌ నేత ఆరోపణలు

Follow Udayam Digital on Google
ప్రణీత రెడ్డి Aug 04, 2026 9:20 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
భారత్‌పై లష్కర్‌ నేత ఆరోపణలు - Udayam Digital
లష్కరే తోయిబా నేత రిజ్వాన్‌ హనీఫ్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో తమ సంస్థకు చెందిన సభ్యులు హతమయ్యారని, దీనికి భారత్‌ నిఘా ఏజెన్సీలే కారణమని ఆరోపించాడు. గత మూడేళ్లలో 30 మందికి పైగా సభ్యులు మరణించారని పేర్కొన్న రిజ్వాన్‌, ఈ ఘటనలను ‘తెలియని గన్‌మెన్‌ మోడల్‌’గా అభివర్ణించాడు. ఈ ఆరోపణలపై అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.

Comments

G
Loading comments...