Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయదుర్గంలో ఎకరం రూ.269 కోట్లు

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 8:16 AM హైదరాబాద్General
రాయదుర్గంలో ఎకరం రూ.269 కోట్లు - Udayam
హైదరాబాద్‌ రాయదుర్గంలో టీజీఐఐసీ నిర్వహించిన భూముల వేలంలో ఎకరం రూ.269 కోట్ల ఆల్‌టైమ్‌ రికార్డు ధర పలికింది. 5.38 ఎకరాల పీ2 ప్లాట్‌ను వంశీరాం బిల్డర్స్‌ కైవసం చేసుకోవడంతో ప్రభుత్వానికి రూ.1,447.22 కోట్ల ఆదాయం సమకూరింది. గత వారం ఇదే ప్రాంతంలో ఎకరం రూ.264 కోట్లు పలకగా, తాజా వేలం ఆ రికార్డును అధిగమించింది. ఈ ధర రిజర్వ్‌ ధర కంటే 52.3 శాతం అధికం.

Comments

G
Loading comments...