వార్తలకు తిరిగి వెళ్లండి

గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సులో నీటిమట్టం 23 అడుగులకు చేరువైంది. ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధమైనా ప్రభుత్వం ఇప్పటివరకు సాగునీటిని విడుదల చేయలేదని రైతులు తెలిపారు.
వారం రోజులుగా వర్షాలు లేకపోవడంతో పంటలపై ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. సరస్సులో నీరు సమృద్ధిగా ఉన్నందున వెంటనే సాగునీటిని విడుదల చేయాలని రైతులు అధికారులను కోరారు.
Comments
Loading comments...

