వార్తలకు తిరిగి వెళ్లండి

బోధన్లోని బెల్లాల్ చెరువు క్రమంగా కబ్జాకు గురవుతోంది. భూముల ధరలు పెరగడంతో కొందరు అక్రమార్కులు చెరువు శిఖం భూమిని తమ సాగు భూముల్లో కలిపేసి చదును చేస్తున్నారు. దీనివల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గి, భూగర్భజలాలు అడుగంటి రైతులు, మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు స్పందించి వెంటనే హద్దులు ఏర్పాటు చేసి, చెరువును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. స్పందించిన నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

