వార్తలకు తిరిగి వెళ్లండి

తుగ్గలి మండలంలోని గిరగేట్ల–మదనంతపురం మధ్య రాజస్థాన్ డాబా సమీపంలో బెంగళూరు–మంత్రాలయం ప్రధాన రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది.
వేగంగా వచ్చిన ఓ లారీ రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందను ఢీకొట్టడంతో సుమారు 80 గొర్రెలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గొర్రెల యజమానులకు భారీ నష్టం వాటిల్లింది. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

