వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో గోవిందరాజులు అనే వ్యక్తి శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుడు కర్నూలు జిల్లా మద్దికేర గ్రామానికి చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

