వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బుధవారం క్విట్ ఇండియా అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ రామ అప్పలనాయుడు మంగళవారం తెలిపారు.
విద్యార్థులతో రణరంగ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి, జాతీయ జెండా ఎగురవేసి నివాళులర్పించనున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ పాల్గొనాలని కోరారు.
Comments
Loading comments...

