వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం మండల ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీటీసీ ఓటర్ల జాబితాను శుక్రవారం ప్రచురించారు. ఎంపీడీవో జె. ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహించి, మండల పరిధిలోని ఎంపీటీసీ స్థానాల ఓటర్ల వివరాలను జాబితాలో పొందుపరిచారు.
ఓటర్లు తమ పేర్లు, వివరాలను పరిశీలించుకునేందుకు జాబితాను కార్యాలయం వద్ద అందుబాటులో ఉంచారు. జాబితాలో తప్పులుంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Comments
Loading comments...

