వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండల కేంద్రం వడ్డెర కాలనీలో కూలిపోయిన మురికి కాలువను అధికారులు గోప్యంగా పరిశీలించడంపై స్థానిక నాయకులు మండిపడ్డారు. రూ.76 లక్షల ప్రజాధనంతో చేపట్టిన నిర్మాణ నాణ్యతను దాచేందుకే సమాచారం ఇవ్వకుండా కొలతలు తీస్తున్నారని నాయకులు ఆరోపించారు.
వివరాలు వెల్లడించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

