వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఖమ్మం జిల్లా పాలేరులో పర్యటించనున్నారు. వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద గల శ్రీహర్ష కన్వెన్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు నిర్వహించే నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు.
ఈ పర్యటనలో పార్టీ సభ్యత్వ నమోదుపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా, ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన వారెవరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా ఎలా ముందుకు సాగాలో కార్యకర్తలకు వివరించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం.
Comments
Loading comments...

