వార్తలకు తిరిగి వెళ్లండి
కార్యకర్త ఇంట్లో కేటీఆర్ భోజనం
మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్సెట్టిపేట మండలం రంగపేటలో పార్టీ సీనియర్ కార్యకర్త చిప్పకుర్తి నారాయణ ఇంట్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.
అంతకుముందు, మే 6న పంటలు కాపాడుకునేందుకు వెళ్లి మృతిచెందిన నలుగురు రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని ఆయన అందజేశారు.
Comments
Loading comments...