Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

Follow Udayam on Google
Jaipal Aug 12, 2026 4:58 PM నాగర్ కర్నూల్General
కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని  తనిఖీ చేసిన కలెక్టర్  - Udayam
బిజినపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటేల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లను పరిశీలించి, తరగతి గదుల్లో విద్యాబోధన విధానం, విద్యార్థుల తీరును సమీక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మెరుగైన అభ్యాసానికి అనుకూలమైన విద్యా వాతావరణం కల్పించాలని ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Comments

G
Loading comments...