వార్తలకు తిరిగి వెళ్లండి

చేయూత పెన్షన్ కోసం వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామ ప్రత్యేకాధికారి డాక్టర్ శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ తెలిపారు.
అధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం గ్రామంలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి దగ్గరకు వెళ్లి క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించారు. అర్హులైన వారికి పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Comments
Loading comments...

