వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ నియోజకవర్గంలోని ఆలేరు గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.
ఎమ్మెల్యే మురళీ నాయక్ వేణుగోపాల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి పనులను పరిశీలించి నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సత్యపాల్ రెడ్డి, గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

