వార్తలకు తిరిగి వెళ్లండి
కృష్ణానదిలో మరపడవల ప్రయాణం నిలిపివేత

కొల్లాపూర్ సోమశిల నుంచి సంగమేశ్వర క్షేత్రం వరకు మరపడవలపై నదీ ప్రయాణాన్ని అధికారులు నిలిపివేశారు. వరద నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్, ఎస్పీ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
పర్యాటకులు, భక్తులు సోమశిలకు రావొద్దని సూచించారు. మరపడవల నిలిపివేతతో తీరగ్రామాల ప్రజలు, మత్స్యకారులపై ప్రభావం ఉంటుందని ఘాట్ సభ్యులు పేర్కొన్నారు.
Comments
Loading comments...