వార్తలకు తిరిగి వెళ్లండి

బచ్చన్నపేట మండలం రామచంద్రపూర్ గ్రామ శివారులో గురువారం విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందాడు. వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ సమస్యను రిపేర్ చేసేందుకు వెళ్లిన అజయ్(26)కు వైరు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

