వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం కోడగల్ నుంచి ఈర్లపల్లి వరకు రోడ్డుకు మట్టి పోసే పనులను సర్పంచ్ గోదల సాయిరెడ్డి ప్రారంభించారు. రహదారి అధ్వానంగా ఉండటంతో పోలపల్లి కంపెనీలు, జాతీయ రహదారి, ఈర్లపల్లి విద్యార్థులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వారి విజ్ఞప్తి మేరకు పనులు చేపట్టినట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆర్. రాజేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ నవీన్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

