Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టు అంజన్న హుండీ లెక్కింపు.. దొంగనోట్ల కలకలం

Follow Udayam on Google
Myadari vamshi vardhan Aug 12, 2026 7:19 PM జగిత్యాలGeneral
కొండగట్టు అంజన్న హుండీ లెక్కింపు.. దొంగనోట్ల కలకలం - Udayam
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపులో నకిలీ నోట్లు బయటపడటం కలకలం రేపింది. బుధవారం అధికారులు హుండీ లెక్కింపు చేపట్టగా రూ.500 నోట్లతో ఉన్న ఐదు కట్టలు నకిలీవిగా గుర్తించినట్లు సూపరింటెండెంట్ సునీల్ తెలిపారు. ఆ కట్టల్లోని నోట్లన్నీ నకిలీవేనని పేర్కొన్నారు. విషయాన్ని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, నకిలీ నోట్లను తిరిగి హుండీలోనే భద్రపరిచినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...