Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వీడియోలపై నెటిజన్ల విమర్శలు

Follow Udayam on Google
రచన దేవి Aug 11, 2026 11:24 AM రంగారెడ్డి తెలంగాణ
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విడుదల చేస్తున్న వీడియోలపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ హక్కులు, నిధుల కోసం ఢిల్లీలో పోరాడాల్సిందిపోయి వీడియోలు చేస్తున్నారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఓటు వేసిన ప్రజలకు ఆయన ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి వీడియోలతో ప్రజలను విసిగించవద్దంటూ కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు.

Comments

G
Loading comments...