వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులోని శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఈ నెల 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణమాస ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సునీల్ కుమార్ వెల్లడించారు.
ఉత్సవాల సందర్భంగా ప్రతీ శుక్రవారం కాళీ హోమం, సామూహిక కుంకుమ పూజలు ఉంటాయని తెలిపారు. అలాగే ఈ నెల 14, 21, 28తో పాటు సెప్టెంబర్ 4వ తేదీల్లో సామూహిక శ్రీ శ్రావణ లక్ష్మీవ్రతాలు జరిపిస్తామని ఆయన వివరించారు.
Comments
Loading comments...

