వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి జిల్లా కల్యాణి ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ప్రాజెక్టులోకి 497 క్యూసెక్కుల ఇన్ప్లే నమోదైనట్లు ఏఈఈ సాకేత్ తెలిపారు. అంతే మొత్తంలో నీటిని ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం నిజాంసాగర్ ప్రధాన కాలువకు నీటిని మళ్లించడం లేదన్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 408.50 మీటర్లుగా నమోదైంది.
Comments
Loading comments...

