వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ భుజంగరావు శుక్రవారం మట్టి గణపతులను పంపిణీ చేశారు. హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను వినియోగించాలని భుజంగరావు సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉద్యోగులు, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

