వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ పాత్రను గుర్తుచేశారు. దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి, వెట్టి చాకిరి నిర్మూలనకు కృషి చేసిన గొప్ప మహిళగా కొనియాడారు. ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలని తెలిపారు.
Comments
Loading comments...

