వార్తలకు తిరిగి వెళ్లండి
కేఎల్రావు కోట్ల మంది రైతుల దైవం

భారత సాగునీటి రంగ పితామహుడు డాక్టర్ కె.ఎల్.రావు కోట్ల మంది రైతులకు ఆరాధ్య దైవమని ఆయన తనయుడు కె.విజయారావు పేర్కొన్నారు. గవర్నర్పేటలో బుధవారం జరిగిన కె.ఎల్.రావు 125వ జయంతి వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని ఆయన సేవలను కొనియాడారు.
దేశంలోని సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగాల అభివృద్ధిలో ఆయన పాత్రను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు, అక్కినేని భవానీ ప్రసాద్ రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు.
Comments
Loading comments...