వార్తలకు తిరిగి వెళ్లండి
క్రైమ్Breaking
కీసర పోలీసుల భారీ ఆపరేషన్.. 60 చోరీ మొబైళ్ల స్వాధీనం.

కీసర పోలీసులు మొబైల్ దొంగతనాల ముఠాపై ప్రత్యేక చర్యలు చేపట్టి ఇద్దరు మహిళా నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఫిర్యాదుదారుడి మొబైల్తో పాటు మొత్తం 60 చోరీ మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొబైళ్ల వివరాలను CEIR, CCTNS, IMEI రికార్డుల ద్వారా పరిశీలిస్తూ వాటి అసలు యజమానులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతర నిందితులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కీసర పోలీసుల వేగవంతమైన చర్యలు, సమర్థవంతమైన దర్యాప్తుతో ఈ విజయం సాధించారు.
Comments
Loading comments...