Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జెడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

Follow Udayam on Google
K.Venkatesh Sep 02, 2026 3:57 PM ఖమ్మంGeneral
ఖమ్మం జెడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత - Udayam
ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై వ్యతిరేకంగా బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టులతో భయపడే వారు ఎవరూ లేరని, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తామని పువ్వాడ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...