Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖర్గేతో భట్టి భేటీ.. సురేఖపై చర్యలా?

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 8:35 AM హైదరాబాద్General
ఖర్గేతో భట్టి భేటీ.. సురేఖపై చర్యలా? - Udayam
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిన్న రాత్రి ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ అయ్యారు. కొండా సురేఖ అంశంపై సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను వివరించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. సురేఖపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. నివేదిక చూశానని ఖర్గే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై రేవంత్‌రెడ్డి, భట్టి, మహేశ్‌ గౌడ్‌ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి.

Comments

G
Loading comments...