వార్తలకు తిరిగి వెళ్లండి
ఖైరతాబాద్ ఓట్ల గందరగోళం

ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రీ-మ్యాపింగ్ ప్రక్రియలోనే సుమారు 12 వేల ఓట్లు తొలగించారని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. ఎన్నికల సంఘం బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోందని, బీఎల్వోలు క్షేత్రస్థాయికి వెళ్లకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
దీనివల్ల వేలాది మంది ఓటర్లు తమ హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డికి అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...