Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఐవీఎఫ్ సేవలపై మంత్రి కీలక ప్రకటన

నవీన్ రెడ్డి Jul 03, 2026 9:27 AM హైదరాబాద్ 4 viewsabout 1 hour ago
ప్రభుత్వ ఐవీఎఫ్ సేవలపై మంత్రి కీలక ప్రకటన - Udayam Digital
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఐవీఎఫ్ సేవలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. గాంధీ, పెట్లబుర్జ్ కేంద్రాల్లో ఇప్పటివరకు 35,000 మందికిపైగా ఉచిత సేవలు పొందారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 490 మంది దంపతులలో 23 గర్భధారణలు విజయవంతంగా నిర్ధారణ అయ్యాయన్నారు. అలాగే ప్రైవేట్ ఫెర్టిలిటీ కేంద్రాల దోపిడీని అరికట్టేందుకు కఠిన నియంత్రణపై దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...