వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
రాష్ట్ర వ్యవసాయ రంగం, రైతుల సమస్యలపై ఇరువురు చర్చించారు. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువుల కొరత లేకుండా సకాలంలో సరిపడా యూరియా, ఇతర ఎరువులు కేటాయించాలని తుమ్మల కోరారు. పామాయిల్కు గ్యారంటీ ధర కల్పించే అంశంపైనా చర్చించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

