వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి కేజీబీవీలో కుర్చీల కొరతను గుర్తించిన పీఆర్టీయూ ధర్పల్లి శాఖ శుక్రవారం 12 కుర్చీలను విరాళంగా అందించింది. ఎంఈఓ రమేష్ కుమార్ చేతుల మీదుగా కుర్చీలను అందజేశారు.
విద్యార్థులు, పాఠశాలల అవసరాలకు పీఆర్టీయూ ఎల్లప్పుడూ సహకరిస్తుందని అధ్యక్షుడు వెంకట్ రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి ప్రసన్నకుమార్, కేజీబీవీ ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

