వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీ కాలువకు ఈ ఏడాది సాగునీరు విడుదల చేయకపోవడంతో కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లోని 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు బీడుగా మారింది. నీళ్లొస్తాయన్న ఆశతో రైతులు సాగు చేసిన వరి పంటలు, నారుమళ్లు ఎండిపోవడంతో పెట్టుబడులు నష్టపోయారు.
ఏటా రెండు లక్షల ఎకరాలకు పైగా వరి సాగయ్యే కేసీ ఆయకట్టులో ఈసారి సాగు నిలిచిపోవడంతో రాయలసీమలో తిండిగింజలు, పశుగ్రాసం కొరత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని కథనం పేర్కొంది.
Comments
Loading comments...

